జేఎన్టీయూ, న్యూస్టుడే: ఈఏపీ సెట్-2022కు దరఖాస్తు చేసిన విద్యార్థులు ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి జూన్ 23 నుంచి జూన్ 26వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు సెట్ ఛైర్మన్ ఆచార్య రంగజనార్దన, కన్వీనర్ విజయ్కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 2,98,634 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. అందులో ఇంజినీరింగ్ ప్రవేశానికి 2,04,540, వ్యవసాయ కోర్సులకు 93,041, రెండింటికీ 1,053 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.5 వేల అపరాధ రుసుంతో జులై 1వ తేదీ వరకు, రూ.10 వేల అపరాధ రుసుంతో జులై 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్టికెట్లు జూన్ 27 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.