ఈనాడు, అమరావతి: ఏలూరులో కొత్తగా ఏర్పాటుకానున్న ప్రభుత్వ వైద్యకళాశాలలో 222 పోస్టుల భర్తీకి పరిపాలనాపరమైన ఆమోదం తెలుపుతూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర జూన్ 28న ఉత్తర్వులు జారీచేశారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, అనాటమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పెథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, డెర్మటాలజీ, ఇతర విభాగాల్లో ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తారు. అలాగే ఇతర పారా మెడికల్ పోస్టులను భర్తీ చేస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.