ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రిక్రూట్ బోర్డులు నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థుల అధీకృతను ధ్రువీకరించుకొనేందుకు ఆధార్ సేవలు ఉపయోగించుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకు వీలు కల్పించాలని కోరుతూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ, భారత విశిష్ట ప్రాధికార సంస్థలకు రైల్వే బోర్డు లేఖలు రాసింది. ఇప్పటివరకు సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు పరిమితమైన ఆధార్ అనుసంధానాన్ని స్వచ్చంద ప్రాతిపదికన రైల్వే బోర్డు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను గుర్తించేందుకు ఉపయోగించుకునేలా వీలు కల్పించాలని లేఖలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖను కోరినట్లు తెలిపింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.