మధ్యలో వెళ్లిపోవచ్చు.. నచ్చితే వచ్చి చదువుకోవచ్చు
ఈనాడు, అమరావతి: నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో భాగంగా నాలుగేళ్ల డిగ్రీలో ఎప్పుడైనా మధ్యలో బయటకు వెళ్లిపోయేలా విద్యార్థులకు ఐచ్ఛికం ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. విద్యార్థి మొదటి ఏడాదిలో మానేసి వెళ్లిపోతే సర్టిఫికెట్ ఇస్తారు. రెండేళ్ల తర్వాత వెళ్లిపోతే డిప్లొమా ప్రదానం చేస్తారు. మూడేళ్లు చదివితే డిగ్రీ, నాలుగేళ్లు పూర్తి చేసే ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. మొదటి ఏడాదిలో చదివి ఆపేసి వెళ్లిపోయిన విద్యార్థి ఎప్పుడైనా వచ్చి మళ్లీ చదువుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. నాలుగేళ్ల డిగ్రీలో మూడేళ్లలో 10 నెలల ఇంటర్న్షిప్ ఉంటుంది. మొదటి ఏడాదిలో ప్రాజెక్టు వర్క్, రెండో ఏడాది వేసవి సెలవుల్లో రెండు నెలలు ఇంటర్న్షిప్, చివరి ఏడాది రెండు సెమిస్టర్లలో ఒక సెమిస్టర్ ఇంటర్న్షిప్ ఉంటుంది.
450 కళాశాలలకు న్యాక్..
రాష్ట్రంలో 450 ప్రైవేటు కళాశాలలకు న్యాక్ గుర్తింపు కల్పించేందుకు ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా దృష్టిసారించింది. కనీస సదుపాయాలు ఉన్న కళాశాలలతో న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అన్ని కళాశాలలు మూడేళ్లల్లో న్యాక్ గుర్తింపు తెచ్చుకోవాలని గతేడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 450 కళాశాలలకు న్యాక్కు వెళ్లేందుకు అవసరమైన సహకారాన్ని ఉన్నత విద్యామండలి అందిస్తోంది. మొదటి విడత 60 కళాశాలతో న్యాక్కు దరఖాస్తు చేయించనున్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ దేశ రాజధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు
‣ విశ్వాసం ఉంటే విలువ తగ్గదు!
‣ కాలేజీలో చేరేముందు కాస్త పరిశీలించండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.