ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారిగా గత ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరిన విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానాన్ని ఈసారి మరింత విస్తరించనున్నారు. గత సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్లలో ఆంగ్లం పరీక్షకు పుస్తకాలు పక్కనపెట్టుకొని రాసుకునే ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానాన్ని అమలు చేశారు. ఈసారి ఆ విద్యార్థులు రెండో ఏడాదిలోకి ప్రవేశించారు. వారికి ఆంగ్లం సబ్జెక్టు ఉండదు. అయితే గణితం సబ్జెక్టులో ఈ విధానంలో పరీక్షలు జరుగుతాయి. అందుకు తగ్గట్లు బోధనతోపాటు ప్రశ్నపత్రాల రూపకల్పన ఉంటుందని ఎస్బీటెట్ కార్యదర్శి సి.శ్రీనాథ్ తెలిపారు. పుస్తకం మొత్తం చదవటంతోపాటు సబ్జెక్టును ఆకళింపు చేసుకుంటేనే ఈ విధానంలో పరీక్షలు బాగా రాయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ శిక్షణ లేదు సొంత నోట్స్తో సాధించా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.