175 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు ఆమోదం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2022-23) 175 ఇంజినీరింగ్ కళాశాలల్లో 1,05,860 బీటెక్ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఆయా కళాశాలలు ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు, వివరాలను పరిశీలించిన ఏఐసీటీఈ తాజాగా వాటి అనుమతికి పచ్చజెండా ఊపింది. గత ఏడాది 175 కళాశాలల్లో 1,05,419, అంతకుముందు (2020-21) సంవత్సరం 1,04,969 సీట్లకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ కళాశాలలతో కలుపుకుంటే 2021-22లో 192 కళాశాలల్లో 1,11,728, 2020-21లో 201 కళాశాలల్లో 1,11,143 సీట్లకు ఆమోదం తెలిపింది. ఏఐసీటీఈ మంజూరు చేసినా ఆయా కళాశాలలను తనిఖీ చేసి అనుమతి ఇచ్చే తుది నిర్ణయం విశ్వవిద్యాలయాలదే. జేఎన్టీయూహెచ్, ఓయూ, కేయూ పరిధిలో మాత్రమే అనుబంధ ప్రైవేట్ కళాశాలలున్నాయి. గత ఏడాది చూస్తే 15 ప్రభుత్వ, 160 ప్రైవేట్ కళాశాలలు మాత్రమే ఎంసెట్ కౌన్సెలింగ్లో పాల్గొన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో గత సంవత్సరం 4,069 సీట్లు ఉండగా...ఈసారి వనపర్తిలో 300 సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్, సుల్తాన్పూర్లలో 60 చొప్పున 120 సీట్లు అదనంగా వస్తాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ప్రపంచ దృక్పథంతో నలంద కోర్సులు
‣ 'మహీంద్రా'లో కొత్త ఎంటెక్ కోర్సులు
‣ సరిహద్దు రహదారుల సంస్థలో ఉద్యోగాలు
‣ మేనేజ్మెంట్ విద్యలో ఆకర్షణీయ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.