ఈనాడు, అమరావతి: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను జులై 26న ఉదయం 11 గంటలకు విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 3,01,172 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,82,496 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఇంజినీరింగ్ పరీక్ష 1,94,752, వ్యవసాయ కోర్సు పరీక్ష 87,744 మంది రాశారు. మొదట అనంతపురంలో జులై 29న విడుదల చేయాలని భావించినా అనివార్య కారణాలతో కార్యక్రమంలో మార్పు చేశారు. ఫలితాలను www.eenadupratibha.netలో చూడవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.