ముథోల్, న్యూస్టుడే: బాసర ఆర్జీయూకేటీ జాబితా ప్రకటించడంలో మరింత ఆలస్యం కానుంది. జులై 30న విడుదల చేస్తామని ప్రకటించిన అధికారులు దరఖాస్తులు ఎక్కువగా రావడం, ఈడబ్ల్యూఎస్ కోటాపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో జాబితా తయారు చేయడానికి తర్జనభర్జన పడుతున్నారు. గతంలో ఈడబ్ల్యూఎస్ కోటా లేకుండానే ప్రకటించేవారు. ఈసారి ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం సీట్లు కేటాయించాల్సి ఉన్న నేపథ్యంలో న్యాయ, ఇతర నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ఈ సారి సీట్ల సంఖ్య పెరగనుంది. ఈసారి 33,005 రాగా 30,657 దరఖాస్తులను ఆమోదించారు. జనరల్ 1500, ఈడబ్ల్యూఎస్ కోటాలో 10శాతం అంటే 150 సీట్లు, గ్లోబల్, ఎన్ఆర్ఐ 105, అగ్రవర్ణ పేదలకు 150తో కలిపి మొత్తం 1,755 సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆగస్టు రెండో వారంలో ప్రకటిస్తాం అని ఇన్ఛార్జి ఉపకులపతి వెంకటరమణ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.