ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఈసెట్లో 19,954 మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. మొత్తం 22,001 మంది పరీక్షలు రాయగా వారిలో 19,954 మంది (90.69 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగస్టు 12న విడుదల చేశారు. లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి 10,300 సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈసెట్ కన్వీనర్ ఆచార్య కె.విజయ కుమార్రెడ్డి మాట్లాడుతూ మొత్తం 11 విభాగాల్లో పరీక్షలు జరిగాయని, బీఎస్సీ గణితం పూర్తి చేసిన వారూ 11 మంది ఈసారి పరీక్షలు రాశారన్నారు. మెకానికల్ విభాగంలో రామిరెడ్డి మనోజ్కుమార్రెడ్డి(కడప, ఏపీ), ఎలక్ట్రికల్లో గుగ్గిళ్ల ప్రణయ్(పాల్వంచ), సివిల్- ఎం.హేమంత్(విజయనగరం-ఏపీ), ఎలక్ట్రానిక్స్- సుంకేశుల సాయి మనస్వి( రైల్వే కోడూరు, ఏపీ), కంప్యూటర్ సైన్స్- కేశరాజు హారిక (హైదరాబాద్) ప్రథమ ర్యాంకు పొందారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.