ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి సెప్టెంబరు 12 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన వారికి ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పరీక్ష ఫలితాలు సెప్టెంబరు 11వ తేదీన వెల్లడవుతాయి. ఆ మరుసటి రోజు నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుందని ఐఐటీ బాంబే ప్రకటించింది. అయితే 20వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ ఉంటుందని, దానివల్ల అభ్యర్థులు తమ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవడానికి వీలువుతుందని ఐఐటీ తెలిపింది. అసలు ప్రక్రియ సెప్టెంబరు 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు బుధవారం ఆరు రౌండ్ల కౌన్సెలింగ్ కాలపట్టికను వెల్లడించింది. ఆరు రౌండ్ల అనంతరం ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే అక్టోబరు 16 నుంచి 21వ తేదీ వరకు కౌన్సెలింగ్ జరుపుతారు. మరోవైపు సీట్ల భర్తీ నియమ నిబంధనలను కూడా ప్రకటించింది. సీట్లు పొందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.40 వేలు, ఇతరులు రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్లో పాల్గొంటాయి. అందులో 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ఐటీలు, మరో 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి.
ఆరు రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవీ..
* 1వ రౌండ్ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23న
* 2వ రౌండ్: సెప్టెంబరు 28వ తేదీ
* 3వ రౌండ్: అక్టోబరు 3
* 4వ రౌండ్: 8వ తేదీ
* 5వ రౌండ్: 12వ తేదీ
* 6వ రౌండ్ (చివరి): అక్టోబరు 16న
జేఈఈ అడ్వాన్స్డ్ స్టడీమెటీరియల్
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఇలా మొదలు పెట్టండి ఇంజినీరింగ్!
‣ అందరికంటే భిన్నంగా.. మరింత మెరుగ్గా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.