• facebook
  • whatsapp
  • telegram

JOSAA: 12 నుంచి జోసా కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి సెప్టెంబరు 12 నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారికి ఆగ‌స్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పరీక్ష ఫలితాలు సెప్టెంబరు 11వ తేదీన వెల్లడవుతాయి. ఆ మరుసటి రోజు నుంచి కౌన్సెలింగ్‌ మొదలవుతుందని ఐఐటీ బాంబే ప్రకటించింది. అయితే 20వ తేదీ వరకు మాక్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని, దానివల్ల అభ్యర్థులు తమ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవడానికి వీలువుతుందని ఐఐటీ తెలిపింది. అసలు ప్రక్రియ సెప్టెంబరు 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు బుధవారం ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌ కాలపట్టికను వెల్లడించింది. ఆరు రౌండ్ల అనంతరం ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే అక్టోబరు 16 నుంచి 21వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ జరుపుతారు. మరోవైపు సీట్ల భర్తీ నియమ నిబంధనలను కూడా ప్రకటించింది. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40 వేలు, ఇతరులు రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటాయి. అందులో 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి.

ఆరు రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవీ..

* 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23న

* 2వ రౌండ్‌: సెప్టెంబరు 28వ తేదీ

* 3వ రౌండ్‌: అక్టోబరు 3

* 4వ రౌండ్‌: 8వ తేదీ

* 5వ రౌండ్‌: 12వ తేదీ

* 6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16న

 

 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్టడీమెటీరియల్

గణితశాస్త్రం

భౌతికశాస్త్రం

రసాయనశాస్త్రం

PREVIOUS PAPERS

MODEL PAPERS

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇలా మొదలు పెట్టండి ఇంజినీరింగ్‌!

‣ అందరికంటే భిన్నంగా.. మరింత మెరుగ్గా!

‣ జోరుగా ఆన్‌లైన్‌ నియామకాలు

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.