విజయవాడ: ఎంసెట్/ ఈఏపీసెట్లో ర్యాంకు సాధించిన అభ్యర్థుల వెబ్ కౌన్సెలింగ్ కోసం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఆగస్టు 26న అవగాహన సదస్సు నిర్వహించారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సులో నిపుణులు పాల్గొని విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కళాశాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. బ్రాంచి ముఖ్యమా? కళాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలా? వెబ్ కౌన్సెలింగ్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఏయే ధ్రువపత్రాలు సమర్పించాలి? లోకల్, నాన్లోకల్పై సందేహాలు, కళాశాల ఎంపిక చేసుకోవాడానికి కొలమానాలేంటి? ఇలా.. అభ్యర్థులకు కలిగే అన్ని రకాల సందేహాలను నివృత్తి చేశారు. ఈ అవగాహన సదస్సులో ఆంధ్రా లయోలా కళాశాల భౌతికశాస్త్ర అధ్యాపకులు ప్రొఫెసర్ తుమ్మల శ్రీకుమార్, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి.సురేంద్రబాబు, శారదా విద్యాంస్థల జీఎం జీవీ రావు తదితరులు పాల్గొని అభ్యర్థుల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ‘ఈనాడు’ యూనిట్ మేనేజర్ కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎంసెట్/ ఈఏపీసెట్-2022 మాక్ కౌన్సెలింగ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.