గత ఏడాది కన్నా 366 అధికం
ఐఐటీ బాంబే వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఈసారి ఐఐటీల్లో బీటెక్ సీట్లు 16,598కు చేరాయి. గత ఏడాది వాటి సంఖ్య 16,232 ఉండగా.. ఈసారి 10 ఐఐటీల్లో మరో 366 సీట్లు పెరిగాయి. ఈ మేరకు ఐఐటీ బాంబే శుక్రవారం సీట్ల వివరాలు ప్రకటించింది. దేశంలో 23 ఐఐటీలు ఉండగా వాటిలోని మొత్తం సీట్లలో బాలికలకు 1567 సీట్లను సూపర్న్యూమరరీ కోటా కింద కేటాయిస్తారు. పోయిన సంవత్సరం ఆ సీట్లు 1534 మాత్రమే. ఈ ఏడాది ఐఐటీ హైదరాబాద్లో 35 సీట్లు అధికంగా అందుబాటులోకి వచ్చాయి. గత నెల 28న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగగా 1,56,089 మంది హాజరయ్యారు. ఒక్కో సీటుకు 2.5 రెట్ల మంది పరీక్షలో అర్హత సాధించేలా కటాఫ్ నిర్ణయిస్తారు. అంటే దాదాపు 42వేల మందికి జోసా కౌన్సెలింగ్కు అవకాశం ఉంటుంది. ఈనెల 11న అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు రానున్నాయి. మర్నాటి నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశానికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆన్లైన్లో లైఫ్ స్కిల్స్ ఒలింపియాడ్
‣ మొబైల్ యాప్ డెవలపర్లకు డిమాండ్!
‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.