ఈనాడు, హైదరాబాద్: టీఎస్ ఈసెట్ తొలివిడత కౌన్సెలింగ్లో ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 88.52 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందినవారు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశించవచ్చు. రాష్ట్రంలోని 166 కళాశాలల్లో ఇంజినీరింగ్ బ్రాంచీల్లో 11,260 సీట్లు ఉండగా.. 9,968 భర్తీ అయ్యాయి. ఫార్మసీలో 118 కాలేజీల్లో 1174 సీట్లకు 50 మాత్రమే నిండాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత విభాగాల్లో 84 శాతం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ల్లో 92 శాతం, మెకానికల్లో 98 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందినవారు ఫీజు చెల్లించి సెప్టెంబర్ 22లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.