కొత్తగూడెం సింగరేణి, న్యూస్టుడే: సింగరేణిలో సెప్టెంబర్ 4న 177 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్ష నియామక ప్రక్రియపై హైకోర్టు సెప్టెంబర్ 17న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ రాత పరీక్షలో అవకతవకలు జరిగినట్లు అభిలాష్ అనే అభ్యర్థి సెప్టెంబర్ 16న లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సందేశాలతో పాటు పలు పత్రికల్లో ప్రచురితమైన కథనాలను న్యాయస్థానానికి అందజేశారు. పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు అభ్యర్థుల పేర్లను కూడా సరిగా చూడలేదని, ప్రశ్నపత్రాలు లీకయ్యాయని ఆయన పేర్కొన్నారు. దీంతో పరీక్ష సజావుగా జరిగినట్లు విచారణలో తేలేంత వరకు అభ్యర్థుల నియామక ఉత్తర్వుల అందజేతను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక జాబితాను సెప్టెంబర్ 16న విడుదల చేయగా సెప్టెంబర్ 17న హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు అందినట్లు సింగరేణి యాజమాన్యం ధ్రువీకరించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.