* ప్రతిభ చాటుతున్న అమ్మాయిలు
* ఏటేటా పెరుగుతున్న వారి అర్హత శాతం
* భవిష్యత్తులో మరింత పెరగవచ్చని అంచనా
ఈనాడు, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ చదివేందుకు జేఈఈ అడ్వాన్స్డ్కు పోటీపడటమే కాదు.. కష్టమైన ఆ పరీక్షలో నెగ్గే బాలికల శాతం క్రమేణా పెరుగుతోంది. వారు అడ్వాన్స్డ్లో కనీస మార్కులు సాధించి.. ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్కు కూడా అర్హత పొంది ప్రత్యేకత చాటుకుంటున్నారు. భవిష్యత్తులో వారి శాతం మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా 2014లో 3 వేల మంది (11 శాతం) బాలికలు అడ్వాన్స్డ్లో అర్హత సాధించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 6 వేలు దాటింది. అందులో అర్హులైన వారు 15 శాతం దాటడం గమనార్హం. ఐఐటీల్లో వారి శాతాన్ని 20కి పెంచాలని నిర్ణయించిన కేంద్రం.. 2018లో 14 శాతంతో సూపర్ న్యూమరరీ సీట్లకు శ్రీకారం చుట్టింది. దాన్ని పెంచుకుంటూ 20 శాతానికి చేర్చింది. దీంతో ఐఐటీల్లో ప్రస్తుతం 20 శాతం మంది అమ్మాయిలు ఉంటారు. ఏటా దాదాపు 3 వేల మందికిపైగా బీటెక్లో ప్రవేశిస్తున్నారు. గతేడాది 16,232 సీట్లలో అమ్మాయిలకు 3,213 సీట్లు దక్కాయి. 2020లో ఆ సంఖ్య 3,197. సూపర్ న్యూమరరీ కోటా ప్రవేశపెట్టక ముందు సంవత్సరం (2017లో) మొత్తం 10,855 సీట్లలో బాలికలకు లభించింది కేవలం 995 సీట్లే.
ఐఐటీ దిల్లీ మాజీ సంచాలకుడు ఆచార్య రాంగోపాల్రావు మాట్లాడుతూ.. ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ సీట్లను కేటాయిస్తున్న కారణంగా బాలికల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్నారు. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుండటంతో వారి సంఖ్య సాధారణ ఇంజినీరింగ్ కళాశాలల్లోనే కాకుండా మున్ముందు ఐఐటీల్లోనూ పెరిగే అవకాశముందని తెలిపారు. శ్రీచైతన్య ఐఐటీ జాతీయ డీన్ ఎం.ఉమాశంకర్ మాట్లాడుతూ.. ఉత్తమ ర్యాంకుల్లో కూడా వారు దూసుకొస్తున్నారని చెప్పారు. 2017లో 35వ ర్యాంకు సాధించిన రమ్య నారాయణస్వామి తెలుగు అమ్మాయేనని గుర్తు చేశారు. తాజాగా విడుదలైన 2022 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల బాలికలు 24, 34, 87, 98 ర్యాంకులను కైవసం చేసుకున్నారని వివరించారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్ డిగ్రీ
‣ ఆలస్యంగా వీసాలు.. ఏం చేస్తే మేలు?
‣ ప్రతికూల ఆలోచనలను పక్కకు నెట్టేయండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.