ఈనాడు, హైదరాబాద్: ప్రత్యేక అవసరాల గల పిల్లల(సీఎస్డబ్ల్యూఎన్)కు సంబంధించి వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు సెప్టెంబరు 26 నుంచి 30వ తేదీ వరకు ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇది ఉంటుంది. ఇంటి నుంచే ఆన్లైన్లో శిక్షణ పొందవచ్చు. ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు పాల్గొనాలి. అయితే దసరా సెలవుల్లో శిక్షణ ఏమిటని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. శిక్షణను వాయిదా వేయాలని టీటీయూ, టీయూటీఎఫ్, టీఎస్టీయూ తదితర సంఘాలు డిమాండ్ చేశాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు
‣ అందరికీ అందని బ్యాంకింగ్ సేవలు
‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి
‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.