• facebook
  • whatsapp
  • telegram

Results: సీయూఈటీ-పీజీ పరీక్ష ఫలితాల విడుదల 

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)-పీజీ’ ఫలితాలు సెప్టెంబరు 26న విడుదలయ్యాయి. అందులో సబ్జెక్టులవారీగా అత్యుత్తమ మార్కులు సాధించినవారి పేర్లను కూడా జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) ప్రకటించింది. సీయూఈటీ-పీజీ కోసం మొత్తం 6.07 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్షను నిర్వహించిన సంగతి గమనార్హం. దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించేందుకు నిర్ణయించాయి. ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇక ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది.

https://ntaresults.nic.in/resultservices/CUET-auth-22

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.