ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు జిల్లాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 14 జిల్లాల్లో ఈ విధానం అమలవుతుండగా.. అదనంగా ఉన్న బయోమెట్రిక్ పరికరాలతో నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాల్లోనూ ప్రారంభించనున్నారు. ఆయా డీఈఓలు తెలంగాణ స్టేట్ టెక్నాలాజికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) అధికారులతో సమన్వయం చేసుకొని సాధ్యమైనంత త్వరగా బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆదేశించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.