* తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా మంజూరు
ఈనాడు, హైదరాబాద్: విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) విడుదలచేసే ఫెలోషిప్లలో తెలుగు విశ్వవిద్యాలయం అత్యధికం దక్కించుకుంది. ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు చేసే విద్యార్థులకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎస్టీ ఫెలోషిప్లు ఇస్తుంది. దేశవ్యాప్తంగా యూజీసీ 750 విడుదల చేయగా.. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా వర్సిటీ విద్యార్థులే 25 దక్కించుకున్నారని, దరఖాస్తు చేసుకున్న దాదాపు అందరికీ దక్కాయని ఉపకులపతి ప్రొ.టి.కిషన్రావు ‘ఈనాడు’కు వివరించారు.
ఈ ఏడూ నిరుపేద విద్యార్థులకు భరోసా
ఫీజు చెల్లించలేని పేద విద్యార్థులకు దాతల సాయంతో ఆర్థిక సహకారం అందించే ప్రయోగాన్ని ఉపకులపతి గత విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ కొనసాగించాలని నిర్ణయించారు. అలాంటి వారు ఉపకులపతి కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థి ఆర్థిక స్థితిగతులు పరిశీలించాక, దాతల సాయంతో ఫీజులు కట్టించే వీలు కల్పిస్తామన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ విద్యుత్ వాహన పరిశ్రమల్లో విస్తృత అవకాశాలు!
‣ ఉద్యోగం.. స్వయం ఉపాధి.. ఫ్రీలాన్సింగ్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.