ఆంధ్రప్రదేశ్లో వివిధ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్-2022 ఫలితాలు అక్టోబర్ 14న విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. 147 సబ్జెక్టులకు 39,359 మంది దరఖాస్తు చేసుకోగా... గత నెల 3, 4, 7, 10, 11 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. సంస్కృతం, ఉర్దూ, తమిళం, బీఎఫ్ఏ, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, ఆర్ట్స్, టూరిజం, జియోగ్రఫీ సబ్జెక్టులకు దరఖాస్తులు తక్కువగా వచ్చినందున పరీక్ష నిర్వహించ లేదు. ఈ సబ్జెక్టుల వారికి డిగ్రీ మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మొబైల్ యాప్ డెవలపర్లకు డిమాండ్!
‣ మెరుగైన భవితకు మేలైన నిర్ణయం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.