ప్రతిపాదిత నమూనాను విడుదల చేసిన ఎన్ఎంసీ
ఈనాడు, హైదరాబాద్: వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరతను అధిగమించడానికి జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనల్లో మార్పు చేసింది. ఇప్పటి వరకూ భారత్లో ఎంబీబీఎస్ చేసి విదేశాల్లో పీజీ వైద్యవిద్య పూర్తి చేసిన నిపుణులు వైద్య కళాశాలల్లో బోధన సిబ్బందిగా పనిచేయడానికి అవకాశాల్లేవు. అలాంటి వారు కేవలం ప్రైవేటు ఆసుపత్రుల్లో స్పెషలిస్టులుగా ప్రాక్టీసు చేస్తున్నారు. ఒకవేళ వారు బోధన చేయడానికి ఆసక్తి చూపినా ఎన్ఎంసీ నిబంధనలు అందుకు అంగీకరించేవి కావు. తాజాగా వాటిని మార్చుతూ ఎన్ఎంసీ ఒక ప్రతిపాదిత నమూనాను విడుదల చేసింది. యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పీజీ వైద్యవిద్య పూర్తి చేసిన స్పెషలిస్టులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మార్పులు చేస్తూ ప్రతిపాదిత నమూనాల్లో సంబంధిత అంశాలను ఎన్ఎంసీ పొందుపర్చింది. దీనిపై సలహాలు, సూచనలు, అభిప్రాయాలను 30 రోజుల్లోగా coordination@nmc.org.inకు పంపించాలని కోరింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.