ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్ ఎంపీసీ స్ట్రీమ్ ఫార్మసీ, బైపీసీ స్ట్రీమ్ ఫార్మసీ కోర్సుల కౌన్సెలింగ్లో జాప్యం కొనసాగుతోంది. భారతీయ ఫార్మసీ కౌన్సిల్ నుంచి కళాశాలలకు అనుమతులు రాకపోవడంతో కౌన్సెలింగ్ వాయిదా పడుతోంది. ఈఏపీసెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. ఇంజినీరింగ్, వ్యవసాయ కోర్సుల ప్రవేశాలు నిర్వహించారు. ఫార్మసీ కళాశాలలకు అనుమతులు లభించలేదని కౌన్సెలింగ్ వాయిదా వేయడంతో విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.