నూజివీడు, న్యూస్టుడే: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు పొందిన కొందరు విద్యార్థులు వ్యక్తిగత కారణాలతో చేరనందువల్లే సీట్లు భర్తీ కాలేదని ఆర్జీయూకేటీ ఉప కులపతి కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ‘3 సార్లు పిలిచినా భర్తీ కాని సీట్లు’ శీర్షికన నవంబరు 20న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఈ ఏడాది పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమైందని పేర్కొన్నారు. అలాగే ఎన్సీసీ, క్రీడల వంటి ప్రత్యేక విభాగాలకు చెందిన అభ్యర్థుల జాబితా సంబంధిత కార్యాలయాల నుంచి అందలేదని తెలిపారు. ప్రత్యేక విభాగంతోపాటు మిగిలిన సీట్లను ఆఖరి కౌన్సెలింగ్లో భర్తీ చేస్తామని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు వేల మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని, గతేడాది కన్నా ఈ సంవత్సరం 5000 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని వెల్లడించారు. సీట్లు భర్తీ కావనే ప్రశ్న ఉత్పన్నం కాదని వివరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.