డిసెంబరు 1 నుంచి బీఈడీ కళాశాలల్లో అమలు
ఈనాడు డిజిటల్, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులందరికీ ముఖ ఆధారిత హాజరును (ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్) అమలు చేయనున్నారు. డిసెంబరు ఒకటి నుంచే దీని అమలుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోగా విద్యార్థుల ముఖ చిత్రాలు, ఇతర వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, డిసెంబరు 1 నుంచి ముఖ ఆధారిత హాజరు వేయాలంటూ ఇప్పటికే బీఈడీ కళాశాలలకు ఆయా విశ్వవిద్యాలయాలు ఆదేశాలిచ్చాయి. బోధన రుసుముల చెల్లింపులో అక్రమాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరుతున్నారు. తరగతులు సక్రమంగా జరగకపోయినా విద్యార్థులతో పరీక్షలు రాయించడం, పరీక్షల సమయం వరకు విద్యార్థుల జాబితాకు మార్పులు చేస్తుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో తొలుత బీఈడీ కళాశాలల్లోనే ఈ హాజరును అమలు చేయబోతున్నారు. తర్వాత డిగ్రీ, పీజీ, సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వారికీ అమలు చేయనున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ ఆధారిత హాజరుకు సంబంధించిన యాప్ను అందిస్తారు. దీన్ని కళాశాలలు ఫోన్, హాజరు యంత్రంలో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు 70 శాతంపైన హాజరు ఉంటేనే బోధన రుసుముల చెల్లింపులు, విద్యా దీవెన వర్తింపజేస్తారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పీజీ విద్యార్థినులకు యూజీసీ ప్రోత్సాహం
‣ డిజిటల్ అక్షరాస్యత... మీకుందా?
‣ మైనారిటీ బాలికలకు ఉపకార వేతనాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.