• facebook
  • whatsapp
  • telegram

Higher Education: నేడు, రేపు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల ఛైర్మన్ల సమావేశం మార్చి 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుందని ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉపాధ్యక్షుడు వి.వెంకటరమణతో కలిసి బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (సీపీఆర్‌హెచ్‌ఈ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నీపా) ఏటా మార్చిలో దేశంలోని అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లతో సంప్రదింపుల సమావేశం దిల్లీలో నిర్వహిస్తాయని తెలిపారు. మొదటిసారిగా హైదరాబాద్‌లో జరుపుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుంచి 24 మంది ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నత విద్య పరిస్థితి, అవలంబిస్తున్న విధానాలు, నూతన జాతీయ విద్యా విధానం, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై సమావేశాల్లో చర్చిస్తారన్నారు. నీపా ఉపకులపతి ఆచార్య సుధాంశు భూషణ్‌ గురువారం కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పరిశ్రమల సంరక్షకులు!

‣ వచ్చేస్తున్నాయ్‌... వర్చువల్‌ ల్యాబ్స్‌!

‣ టెన్త్‌ మార్కులతో పోస్టల్‌ ఉద్యోగం!

‣ బీటెక్‌ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!

‣ కోస్ట్‌గార్డ్‌ కొలువు కావాలా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.