ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 250 నర్సింగ్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న 9,980 బీఎస్సీ నర్సింగ్ సీట్లకు ప్రవేశానికి ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ (బైపీసీ స్టీమ్) ర్యాంకు తప్పనిసరిగా ఉండాలని విజయవాడ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ను మార్చి 15న ఆమె విడుదల చేశారు. జనరల్ కేటగిరీలో 50 పర్సంటైల్, ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్, ఓసీ జనరల్ వికలాంగులకు 45, ఎస్సీ/ ఎస్టీ/ బీసీ కేటగిరీ వికలాంగులకు 40 పర్సంటైల్ ఉండాలన్నారు. విశ్వవిద్యాలయం ఎంసెట్ మెరిట్ ఆర్డర్ ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించనున్నారని వివరించారు. ఇతర మార్గ నిర్దేశకాలకు ‘డిఆర్ఎన్టిఆర్యుహెచ్ఎస్.ఇన్’ వెబ్సైట్ పరిశీలించవచ్చు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మహిళలకు యూనిఫామ్ సర్వీసెస్ కోర్సులు!
‣ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏంచేయాలి?
‣ విదేశీ విద్యకు సిద్ధమవుతున్నారా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.