• facebook
  • whatsapp
  • telegram

Vidya Devena: ప్రభుత్వం ఇచ్చిన ఫీజులనే కట్టాలి: ఆర్జీయూకేటీ వీసీ

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విద్యా దీవెన డబ్బులనే చెల్లించాలని కోరుతున్నామని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఉపకులపతి(వీసీ) విజయకుమార్‌ తెలిపారు. ప్రభుత్వం విద్యా దీవెన డబ్బులు విడుదల చేయగానే ఫీజు చెల్లించాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నామని వెల్లడించారు. బీటెక్‌ నాలుగో ఏడాది విద్యార్థుల పరీక్షలు ఇటీవల పూర్తయ్యాయని, ప్రాజెక్టు సమీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఫలితాలు ఇచ్చాక ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. సర్టిఫికెట్లను తమవద్ద ఉంచుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.