* జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రం పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం(మే 20) విడుదలయ్యాయి. పరీక్షలకు 4.4 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 86.60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదీ పదో తరగతి ఫలితాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. పరీక్ష రాసిన బాలికల్లో 88.53 శాతం మంది ఉత్తీర్ణులవ్వగా, బాలురలో 84.68 శాతం మంతి ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో.. 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం విద్యాశాఖ సప్లిమెంటరీ తేదీలను ప్రకటించింది. జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. మే 26లోపు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణతా శాతం..
పరీక్షల్లో 2,793 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించగా.. 25 పాఠశాలలు సున్నా శాతం ఉత్తీర్ణత ఫలితాలను పొందాయి. ప్రథమ భాషలో 98.17 శాతం మంది, ద్వితీయ భాషలో 99.70 శాతం, తృతీయ భాషలో 98.45 శాతం మంది పాసయ్యారు. మ్యాథ్స్లో 91.65, సైన్స్లో 93.91, సోషల్లో 98.83 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
టెన్త్ తర్వాత ఉద్యోగాలు, కోర్సులు
‣ ఇంటర్మీడియట్ | ‣ వృత్తివిద్య (ఇంటర్మీడియట్) |
‣ పాలిటెక్నిక్ | ‣ ఆర్జేసీ |
‣ ఐటీఐ | ‣ వ్యవసాయ పాలిటెక్నిక్ |
‣ ఉద్యోగాలు | ‣ ఇతర కోర్సులు |
‣ స్వల్పకాలిక కోర్సులు |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.