సాలూరు, న్యూస్టుడే: రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలంటూ సీఎం జగన్ను కోరతామని, అప్పుడు సమన్వయంతో పనిచేసి సత్ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని ఉపముఖ్యమంత్రి రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని రాజన్నదొర క్యాంపు కార్యాలయంలో మే 10న స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గిరిజనులకు శ్రేష్టమైన విద్యనందించేందుకు 2005లో వైఎస్సార్ ఎక్స్లెన్స్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. గిరిజన విద్యార్థులు స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో చేరి విదేశీ విద్యతో పాటు ఎ-గ్రేడ్ ఇంజినీరింగ్ కళాశాలలు, ఐఐటీ, ఎన్ఐటీ, వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందుతున్నారని చెప్పారు. ప్రవేశ పరీక్షల ఫలితాలను సంయుక్త కార్యదర్శి ఎం.రమణమూర్తి మంత్రులకు వివరించారు. జోగింపేట(పార్వతీపురం మన్యం), విశాఖపట్నం, శ్రీకాళహస్తి(తిరుపతి), శ్రీశైలం(నంద్యాల)లో ఉన్న స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లలో 180 సీట్లుండగా 867 మంది ప్రవేశపరీక్ష రాశారని తెలిపారు. మల్లి(పార్వతీపురం మన్యం), విస్సన్నపేట(ఎన్టీఆర్ జిల్లా), తనకల్లు(శ్రీసత్యసాయి జిల్లా)లోని కాలేజీ ఆఫ్ ఎక్స్లెన్స్లలో 240 సీట్లకు 3,458 మంది పరీక్ష రాశారని, వీరిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి సీట్లు కేటాయిస్తామని చెప్పారు. అనంతరం పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ముగ్గురు విద్యార్థులు ఆరిక చరణ్ తేజ, నిమ్మక వివేకవర్ధన్ (గుమ్మలక్ష్మీపురం), సవర అనిల్కుమార్(మందస)లను మంత్రులు సత్కరించి అభినందించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రామర్ తెలిస్తే మార్కులు ఈజీ
‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్లో ఉద్యోగాల భర్తీ
‣ షిప్పింగ్ కోర్సులతో మేటి అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.