ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మే 17న 296 పరీక్షా కేంద్రాల్లో పాలిసెట్ జరగనుంది. పాలిటెక్నిక్ డిప్లొమాల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈ పరీక్షకు మొత్తం 1,05,656 మంది దరఖాస్తు చేశారు. అందులో అమ్మాయిలు 47,188 మంది, అబ్బాయిలు 58,468 మంది ఉన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులను ఉదయం 10 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు ఓఎంఆర్లోని రెండు వైపుల వివరాలను పూర్తిచేసి సంతకం చేయాలి. హాల్టికెట్పై ఫొటో ప్రింట్ కాకుంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటో, గుర్తింపు కార్డు(ఆధార్) తెచ్చుకోవాలని కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ సూచించారు.
* ఇంజినీరింగ్ డిప్లొమా చేయాలనుకునే వారికి గణితం 60, భౌతిక, రసాయనశాస్త్రాలకు 30 మార్కుల చొప్పున... అంటే 120 మార్కుల పరీక్షరాయాలి. దానికి 83,210 మంది దరఖాస్తు చేశారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లొమా చేయాలనుకునే వారు పైవాటికి అదనంగా జీవశాస్త్రంలో మరో 30మార్కులకు పరీక్ష ఉంటుంది. దీనికి 22,446మంది దరఖాస్తు చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అసిస్టెంట్ ప్రొఫెసర్ల కౌన్సెలింగ్ ప్రారంభం
‣ మన ఊరు మన బడి.. లక్ష్యసాధనలో తడబడి!
‣ 600 బడుల్లో కంప్యూటర్ ల్యాబ్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.