జనగామ అర్బన్, న్యూస్టుడే: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో మే 23న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి సీహెచ్.ఉమారాణి మే 19న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో కస్టమర్ సర్వీసు ఎగ్జిక్యూటివ్ విభాగంలో 300 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసున్న వారు మే 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ముఖాముఖిలో సంబంధిత విద్యార్హతల నకళ్లతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 79954 30401 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జులైలో టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాత పరీక్షలు
‣ తగ్గుతూ పెరిగి.. చైనాను దాటి!
‣ డిగ్రీతో సీఏపీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్డీ అడ్మిషన్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.