• facebook
  • whatsapp
  • telegram

AP ICET: '24న ఐసెట్‌' నిమిషం నిబంధన అమలు

అనంతపురం (ఎస్కేయూ), న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ను మే 24న‌ నిర్వహించనున్నట్లు పరీక్షల నిర్వహణ ఛైర్మన్‌, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) ఉపకులపతి ఆచార్య రామకృష్ణారెడ్డి తెలిపారు. అనంతపురంలోని విశ్వవిద్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ‘ఏపీలో 109, తెలంగాణలో రెండు చోట్ల పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోం. మొత్తం అన్ని కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రెండు విడతల్లో పరీక్ష జరుగుతుంది. విద్యార్థులను గంటన్నర ముందునుంచి అనుమతిస్తాం’ అని ఉపకులపతి పేర్కొన్నారు. ఈ పరీక్షకు మొత్తం 49,162 మంది దరఖాస్తు చేశారని ఆయన తెలిపారు. హాల్‌టికెట్‌లో పొరపాట్లుంటే హెల్ప్‌లైన్‌ కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. సమావేశంలో ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య మురళీకృష్ణ, రిజిస్ట్రార్‌ ఆచార్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ యాదాద్రి సంస్కృత పాఠశాలలో ప్రవేశాలు

‣ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రిన్సి‘ఫాల్సే’

‣ ఐఎస్‌బీకి దేశంలో మొదటి స్థానం

‣ ఇంటర్‌తో ఉపాధ్యాయ విద్య.. డీఎడ్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.