• facebook
  • whatsapp
  • telegram

AP Polycet: 25 నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: 2023-24 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్ల్లో అందుబాటులో ఉన్న వివిధ ట్రేడుల్లో అందుబాటులో ఉన్న సీట్లకు మే 25వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించి ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.250 ముందస్తుగా చెల్లించి ఆప్షన్ల కసరత్తుకు అర్హత పొందాలి. అలాగే 29వ తేదీ నుంచి జూన్‌ 5వ తేదీ వరకు మెరిట్‌ ఆర్డరు మేరకు ఆయా కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలి. ప్రత్యేక కేటగిరీ క్రీడా, ఎన్‌సీసీ, ఆర్మీ, వికలాంగుల, ఇండియన్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అభ్యర్థులు జూన్‌ రెండో తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయా బోర్డుల ఎదుట పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. జూన్‌ 1, 2 తేదీల్లో ఒకటో ర్యాంకు నుంచి 50వేల వరకు, 3, 4 తేదీల్లో 50001 నుంచి 90,000 వరకు, 5, 6 తేదీల్లో 90,001 నుంచి ఆఖరి ర్యాంకుల వరకు ఆప్షన్లు కసరత్తు చేసుకోవాలి. జూన్‌ 7న ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కల్పించారు. 9వ తేదీన సీట్ల కేటాయింపులు వెల్లడించనున్నారు. జూన్‌ 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ర్యాంకులు పొందిన అభ్యర్థులు సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ విద్యాదీవెన నిధుల విడుదల 24న

‣ అనులోమ విలోమాల్లో అంత్యమధ్యమాలు!

‣ సమ్మర్‌లో సరికొత్త కోర్సులు

‣ సరిహద్దు దళంలో 247 కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.