ఏపీఎస్డీటీ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్
ఈనాడు, అమరావతి: జర్మనీలో పని చేసేందుకు 150మంది బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జులై 5న తెలిపారు. నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నామని, జులై 6 నుంచి ఎంపిక చేపడుతున్నామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు జులై 10 నుంచి ఏ1, ఏ2, బీ1 స్థాయి వరకు జర్మనీ భాషలో రెండు నెలలపాటు శిక్షణ ఇచ్చి, అనంతరం వీసా ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మలుపులు తిరిగి.. మహోద్ధృత పోరుగా మారి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.