• facebook
  • whatsapp
  • telegram

Dravida Versity: పీహెచ్‌డీల ప్రదానంపై వీసీకి నోటీసులు

ఈనాడు, అమరావతి: ద్రవిడ విశ్వవిద్యాలయంలో గతంలో పీహెచ్‌డీ పట్టాల ప్రదానంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు విచారణ కమిటీ నివేదిక సమర్పించినందున నోటీసులకు సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం నిబంధనలు, న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా పీహెచ్‌డీ పట్టాలు ప్రధానం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ శేషశయనరెడ్డిని విచారణ అధికారిగా నియమించింది. జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి ఆయన నివేదిక సమర్పించారు. దీనిపై ఉపకులపతి తుమ్మల రామకృష్ణ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. నిర్ణీత సమయంలో సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

మరింత సమాచారం... మీ కోసం!

సీఈసీఆర్‌ఐ-తమిళనాడులో 13 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఖాళీలు

‣ తిరుపతి స్విమ్స్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ 

నేషనల్ ఓపెన్ స్కూల్‌లో పది, ఇంటర్‌ ప్రవేశాలు

 జడ్చర్ల ఎస్వీకేఎం స్కూల్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.