• facebook
  • whatsapp
  • telegram

Self Finance: సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లపై విద్యార్థుల ఆసక్తి

* కొత్త వైద్య కళాశాలలపై సీఎంకు వివరించిన అధికారులు


ఈనాడు, అమరావతి: ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన అయిదు వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి స్పందన కనిపిస్తోందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరును సీఎం ఆగ‌స్టు 24న‌ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ‘ప్రైవేటు వైద్యకళాశాలల్లో కంటే ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సెల్ఫ్‌ఫైనాన్స్‌ సీట్లపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, పాడేరు, ఆదోని, మర్కాపురం, మదనపల్లెలోని కొత్త వైద్య కళాశాలల్లోనూ ప్రవేశాలు జరుగుతాయి. 2025-26లో మిగిలిన కళాశాలల నిర్మాణాలు పూర్తవుతాయి. 2025-26 విద్యా సంవత్సరంలో మిగిలిన వైద్యకళాశాలలూ ప్రవేశాలకు సిద్ధమవుతాయి’ అని వివరించారు.
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ వర్చువల్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?

‣ విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు

‣ 18 ఎయిమ్స్‌లలో నర్సింగ్‌ ఆఫీసర్లు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.