ఆంధ్రప్రదేశ్ నుంచి 5 విద్యాసంస్థలు కేంద్రం అంతర్గత విచారణలో బహిర్గతం
ఈనాడు, అమరావతి: మైనారిటీ విద్యార్థుల ఉపకార వేతనాల్లో నిధులు దుర్వినియోగమైనట్లు కేంద్రం దేశవ్యాప్తంగా గుర్తించిన 830 విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 5 ఉన్నాయి. 2017-22 మధ్య మైనారిటీ విద్యార్థులకు మంజూరుచేసిన ఉపకారవేతనాలకు సంబంధించి రూ.144.83 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు కేంద్రం తన అంతర్గత విచారణలో గుర్తించింది. దేశవ్యాప్తంగా 1,572 విద్యాసంస్థల్లో తనిఖీలు చేపట్టగా అందులో 18 రాష్ట్రాల్లోని 830 సంస్థల్లో అవినీతి జరిగినట్లు తేల్చింది. దీనిపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించగా... రెండు రోజుల క్రితం సదరు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాష్ట్రంలోని 18 విద్యాసంస్థల్లో కేంద్రం తనిఖీలు నిర్వహించగా వాటిలోని ఐదింటిలో అవినీతి జరిగినట్లు నివేదికలో పొందుపరిచింది. ఈ విద్యాసంస్థల్లో యూడైస్ డూప్లికేషన్ జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఆ సంస్థలు ఏవనే వివరాలు ఇంకా రాష్ట్ర అధికారులకు అందలేదు. సీబీఐ విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
మరింత సమాచారం... మీ కోసం!
ఏపీపీఎస్సీ 3,295 పోస్టుల భర్తీకి ఆమోదం
ఆర్సీఎఫ్లో మేనేజ్మెంట్ ట్రెయినీలు
దినసరి కూలీ.. డాక్టరేట్ సాధించింది
ఓఎన్జీసీ-40 అప్రెంటిస్షిప్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.