• facebook
  • whatsapp
  • telegram

CPGET 2023: సీపీగెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు

* 22వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ పూర్తిగా మారింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను కన్వీనర్‌ ఆచార్య ఎల్‌.పాండురంగారెడ్డి సెప్టెంబ‌రు 15న‌ విడుదల చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సెప్టెంబ‌రు 5వ తేదీ నుంచి ప్రారంభం..15వ తేదీని తుది గడువుగా నిర్ణయించగా...తాజాగా ఆ గడువును సెప్టెంబ‌రు 22వ తేదీ వరకు పొడిగించారు. మహాత్మాగాంధీ, కాకతీయ వర్సిటీల బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టుల ఫలితాలు ఇంకా వెలువడకపోవడంతో ఈ మార్పు చేసినట్లు తెలిసింది. సెప్టెంబ‌రు 15 వరకు మొత్తం 30 వేల మంది రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నారు.

ఇదీ కాలపట్టిక...

* సెప్టెంబ‌రు 22 వరకు: రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన

* 23 నుంచి 26వ తేదీ వరకు: వెబ్‌ ఆప్షన్ల నమోదు

* 29వ తేదీ: తొలి విడత సీట్ల కేటాయింపు

* అక్టోబరు 4 వరకు: సీట్లు పొందిన వారు కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి

* అక్టోబరు 6 నుంచి: రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా రిజిస్ట్రేషన్‌ ప్రారంభం


 


మరింత సమాచారం... మీ కోసం!

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

‣ ‘పవర్‌ బీఐ’తో బెస్ట్‌ కెరియర్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.