• facebook
  • whatsapp
  • telegram

Meical College: 8 వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.1447 కోట్లు

* ఉత్తర్వులు విడుదల



ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభించనున్న 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.1447 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. గద్వాల, నర్సంపేట, యాదాద్రి, కుత్బుల్లాపూర్‌, నారాయణపేట, ములుగు, మెదక్‌, మహేశ్వరంలలో వైద్యకళాశాలలను మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటికి భవనాలు, హాస్టళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తూ ఆ శాఖ కార్యదర్శి ఎస్‌.ఎ.ఎం.రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గద్వాల, నర్సంపేట, యాదాద్రిలో వైద్య కళాశాలలకు రూ.183 కోట్ల చొప్పున, కుత్బుల్లాపూర్‌కు రూ.182 కోట్లు, నారాయణపేట, ములుగు, మెదక్‌ కాలేజీలకు రూ.180 కోట్ల చొప్పున, మహేశ్వరం వైద్య కళాశాలకు రూ.176 కోట్లు కేటాయించారు.

సీఎంకు కృతజ్ఞతలు: హరీశ్‌రావు

నిధుల కేటాయింపుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.  జిల్లాకో డిగ్రీ కాలేజీ లేని పరిస్థితుల నుంచి జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకునే స్థాయికి రాష్ట్రం చేరుకున్నట్లు తెలిపారు. భారాస పాలనలో తెలంగాణ మెడికల్‌ హబ్‌గా అవతరించిందన్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.