‣ క్యాంపస్క్రాప్తో కలిసి ఇంటర్ బోర్డు నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్మీడియట్ తర్వాత ఏ రంగంలో రాణిస్తారో శాస్త్రీయంగా తెలుసుకునేందుకు ఇంటర్బోర్డు కెరియర్ కౌన్సెలింగ్ను నిర్వహించనుంది. క్యాంపస్ క్రాప్ అనే సంస్థతో కలిసి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఇంటర్బోర్డు కార్యాలయంలో మార్చి 15న కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదివే ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు ఉచితంగా వినియోగించుకోవచ్చన్నారు. ఆయా కళాశాలలు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆ తర్వాత కళాశాలల ద్వారా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. క్యాంపస్ క్రాప్ ప్రతినిధి ఆచార్య ఆర్యశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు 45 నిమిషాలపాటు నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంటుందని, ఆన్లైన్లోనే ఆయా ప్రశ్నలకు సమాధానం చెబితే 15 పుటల నివేదిక అందజేస్తామన్నారు. దానివల్ల ఏ విద్యార్థి ఏ రంగంలో రాణిస్తాడో తెలుసుకోవచ్చని చెప్పారు. అయితే నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ జరపాలంటే మాత్రం కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. క్యాంపస్ క్రాప్ సీఈఓ మహేష్ మాట్లాడుతూ www.tsbie.campuscrop.in ద్వారా కళాశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దశల వారీగా 4వ తరగతి నుంచి కెరియర్ కౌన్సెలింగ్ను అందుబాటులోకి తెస్తామన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.