‣ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యామండలి నిర్ణయం
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యామండలి నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ విధానం ఉండగా.. విద్యా సంవత్సరం మొదట్లో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏ కళాశాలకు ఆ కళాశాలలోనే ప్రాక్టికల్స్ ఉంటాయని పేర్కొంది. జంబ్లింగ్ లేకుండానే మార్చి 11నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ను సైతం విడుదల చేసింది. దీని ప్రకారం ఇన్విజిలేటర్ల నియమాక కసరత్తు పూర్తి చేశారు. ఇప్పుడు అనూహ్యంగా జంబ్లింగ్ విధానం కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థుల పరీక్ష కేంద్రాలు మారిపోనున్నాయి. ఒకే కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వివిధ కళాశాలల్లో పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,34,815మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. షెడ్యూల్లో ప్రకటించిన 1,757 పరీక్ష కేంద్రాల సంఖ్య మారనుంది.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లు
‣ ఇంటర్మీడియట్ స్టడీమెటీరియల్
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.