• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్‌లో గణితం కఠినం

ఈనాడు, అమరావతి, కానూరు, న్యూస్‌టుడే: ఫిబ్రవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 మొదటి విడతతో పోలిస్తే.. రెండో విడతలో తొలిరోజు మార్చి 16న ఉదయం జరిగిన పరీక్ష కఠినంగా ఉందని నిపుణులు తెలిపారు. ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని, న్యూమరికల్‌ సమస్యలు ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. గణితం-బిలో ప్రశ్నలు బాగా కఠినంగా వచ్చినట్లు తెలిపారు. పక్షం రోజుల వ్యవధిలోనే మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పించినా మొదటిసారి కంటే ఈసారి స్కోర్‌ పెరిగే అవకాశం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో నిరూపక జ్యామితి నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారని, విద్యార్థులు ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాయని తెలిపారు.   ‘గణితం ప్రశ్నలు కొన్ని కఠినంగా ఉన్నాయి... మరికొన్ని ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాయి’ అని జేఈఈ నిపుణుడు ఉమాశంకర్‌ తెలిపారు. మరో నిపుణుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ ఉదయం ప్రశ్నపత్రంలో భౌతిక, రసాయనశాస్త్రాల ప్రశ్నలు కొంత సులభంగా ... మధ్యాహ్నం పరీక్షలో మధ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. ఈసారి ఆంగ్లం, హిందీతోపాటు మరో 11 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం అభ్యర్థుల్లో ఆంగ్లం ప్రశ్నపత్రాన్ని 5,79,759 మంది, హిందీని 19,497 మంది, ఇతర భాషలను 20,382 మంది ఎంచుకున్నట్లు జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) తెలిపింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.