• facebook
  • whatsapp
  • telegram

ఏప్రిల్ 4 వ‌ర‌కు జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు 

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు, మే 24 నుంచి 28 వరకు జరిగే జేఈఈ మెయిన్‌ మూడో, నాలుగో విడత ఆన్‌లైన్‌ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించినట్లు జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) తెలిపింది. అభ్యర్థులు ఏప్రిల్‌ 4వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవాలని, రుసుమును మాత్రం 5 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. మూడో విడతలో పేపర్‌-1, నాలుగో విడతలో పేపర్‌-1, 2 పరీక్షలు జరుగుతాయని తెలిపింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.650, మహిళ‌లు, రిజర్వేష‌న్ కేట‌గిరీ వారు రూ.325 చెల్లించాలి. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇప్ప‌టికే ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో మొద‌టి, రెండో విడ‌త ప‌రీక్షలు జ‌రిగి ఫ‌లితాలు కూడా వెలువ‌డ్డాయి. 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.