ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 27 నుంచి 30 వరకు, మే 24 నుంచి 28 వరకు జరిగే జేఈఈ మెయిన్ మూడో, నాలుగో విడత ఆన్లైన్ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించినట్లు జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) తెలిపింది. అభ్యర్థులు ఏప్రిల్ 4వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవాలని, రుసుమును మాత్రం 5 వరకు చెల్లించవచ్చని పేర్కొంది. మూడో విడతలో పేపర్-1, నాలుగో విడతలో పేపర్-1, 2 పరీక్షలు జరుగుతాయని తెలిపింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.650, మహిళలు, రిజర్వేషన్ కేటగిరీ వారు రూ.325 చెల్లించాలి. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్సైట్ను సందర్శించాలి. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొదటి, రెండో విడత పరీక్షలు జరిగి ఫలితాలు కూడా వెలువడ్డాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.