ఈనాడు, అమరావతి: జేఈఈ మెయిన్స్ పరీక్షలో జూన్ 24న ఉదయం వచ్చిన ప్రశ్నపత్రం మధ్యస్తంగా ఉన్నట్లు శారద, చైతన్య కళాశాలలకు చెందిన నిపుణులు విఘ్నేశ్వరరావు, మురళీరావు తెలిపారు. గణితం కొంచెం కష్టంగా ఉండగా.. భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి ఇచ్చిన ప్రశ్నలు తేలికగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరూపక జ్యామితి, కలన గణితం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో గణితం, భౌతికశాస్త్రం సబ్జెక్టుల నుంచి వచ్చిన ప్రశ్నలు మధ్యస్తంగా ఉండగా.. రసాయన శాస్త్రం సబ్జెక్టు ప్రశ్నలు తేలికగా ఉన్నాయి. మొత్తం మీద ప్రశ్నపత్రం మధ్యస్తంగా ఉన్నట్లు తెలిపారు. పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసినవారు, కొంచెం కష్టపడిన వారు ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.