• facebook
  • whatsapp
  • telegram

6 రోజులు వరుసగా పదో తరగతి పరీక్షలు 

ప్రధాన సబ్జెక్టులు మే 17 నుంచి 22 వరకు 
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఫిబ్ర‌వ‌రి 25 

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈసారి ఆరు రోజులపాటు వరుసగా జరగనున్నాయి. మధ్యలో ఒక్కరోజు కూడా వ్యవధి లేదు. కరోనా పరిస్థితుల కారణంగా 11కు బదులు ఈసారి ఆరు పరీక్షలే జరుపుతున్నారు. ప్రధాన సబ్జెక్టులు మే 17న(సోమవారం) ప్రారంభమై 22న(శనివారం) పూర్తవుతాయి. ఆ తర్వాత తక్కువ మంది హాజరయ్యే ఓరియంటల్, ఒకేషనల్‌ సబ్జెక్టుల పరీక్షలు మూడు రోజులపాటు జరుగుతాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) మంగళవారం పరీక్షల కాలపట్టికను ప్రకటించింది. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు.. అంటే 3.15 గంటలపాటు జరుగుతాయి. ఒక్కో సబ్జెక్టుకు ఒకే పరీక్ష కావడంతో ఈసారి అరగంట సమయం పెంచారు. ఆబ్జెక్టివ్‌ పేపర్‌(పార్ట్‌-బి) చివరి అరగంటలో రాయాలి. ప్రశ్నపత్రాల నమూనా, ఛాయిస్‌ల వివరాలను ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని బోర్డు సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తెలిపారు. పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా 125 రూపాయలు ఫిబ్ర‌వ‌రి 25 తేదీ వరకు ప్రధానోపాధ్యాయుల ద్వారా చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుముతో మార్చి 3, రూ.200తో మార్చి 10, రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 16వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం ఉంది.

* ఇదీ పరీక్షల కాలపట్టిక 

తేదీ          సబ్జెక్టు 

మే 17       తెలుగు 

18         హిందీ 

19         ఆంగ్లం 

20          గణితం 

21          జనరల్‌ సైన్స్‌ 

22          సాంఘికశాస్త్రం 

***

24        ఓరియంటల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1

25        ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2

26        ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.