• facebook
  • whatsapp
  • telegram

పదోతరగతి పరీక్ష రుసుము చెల్లింపు మార్చి 20 నుంచి

ఈనాడు, అమరావతి: పదోతరగతి పరీక్ష రుసుమును మార్చి 20నుంచి చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ ఐదో తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అపరాధ రుసుము రూ.50తో ఏప్రిల్‌ 12, రూ.200తో 20, రూ.500తో 30వ తేదీ వరకు సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు. 

2019 ముందువారికి అంతర్గత మార్కులు 

పదోతరగతి పరీక్షల్లో 2019కి ముందు అనుత్తీర్ణులైన విద్యార్థులు ఈసారి కొత్త విధానంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. 2017 నుంచి 2019 వరకు అనుత్తీర్ణులైన వారికి ఏడు పేపర్ల విధానంలో 100మార్కుల పరీక్షలు ఉంటాయి. వీరికి గతంలో అంతర్గత మార్కులు 20శాతం ఉన్నందున ప్రస్తుత 100మార్కులను 80కి కుదించి, అంతర్గత మార్కులు కలుపుతారు. సీబీఎస్‌ఈ, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి రాష్ట్రంలో పదోతరగతిలో చేరిన వారికి రెండో భాష కింద ఆంగ్లం ఉంటుంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నాన్‌ డీటెయిల్డ్, గ్రామర్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.