ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్ష రుసుము చెల్లించేందుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో 22 వరకు, రూ.200తో 29, రూ.500తో మే నెల ఆరో తేదీ వరకు చెల్లించొచ్చని సూచించారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. పట్టణాల్లో ఏడాదికి రూ.24వేలు, గ్రామాల్లో రూ.20వేల ఆదాయం, మాగాణి 2.5 ఎకరాలు, మెట్ట 5 ఎకరాల్లోపు ఉన్న వారికి పరీక్ష రుసుము మినహాయింపు ఉన్నట్లు వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.