* జూన్ 10 నుంచి ఆన్లైన్ కౌన్సెలింగ్
పొన్నూరు, న్యూస్టుడే: గుంటూరు జిల్లా చేబ్రోలు మండల వడ్లమూడిలోని ‘విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ’ ప్రవేశ పరీక్ష ‘వీశాట్ 2020’ ఫలితాలను జూన్ 6న ఉప కులపతి డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈసారి అదనంగా 20% మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. ర్యాంకుల ఆధారంగానే జూన్ 10 నుంచి ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రారంభిస్తామన్నారు. వీశాట్ 2020 ర్యాంకులతో పాటు జేఈఈ మెయిన్స్ ఫలితాలు, ఎంసెట్ ర్యాంకులు, ఇంటర్ మార్కులనూ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. వీశాట్లో 1-100 లోపు ర్యాంకులు సాధించిన వారికి 75 శాతం, 100-200 లోపు వస్తే 50 శాతం, 201-400 లోపు వచ్చినవారికి 25 శాతం, 401-2000 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 10 శాతం ఫీజు రాయితీ నాలుగేళ్లపాటు ఉంటుందన్నారు. పరీక్ష ఫలితాలు వివరాలకు టోల్ఫ్రీ నంబరు 1800 425 2529ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.