• facebook
  • whatsapp
  • telegram

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి... ప్రభుత్వ అనుమతి రాగానే రాత పరీక్షలు

* పరీక్ష కేంద్రాలు మార్చుకోవడానికి 9 వరకు గడువు పెంపు
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌


ఈనాడు-అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,026 ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన 10.63 లక్షల మందికి ప్రభుత్వ అనుమతి రాగానే రాత పరీక్షలు నిర్వహిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపారు. ఈపాటికే ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాప్యమైనట్లు ఆయన ‘ఈనాడు'కి వివరించారు. పరీక్షలను ఆగ‌స్టు నెలలో నిర్వహించాలనుకున్నా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చిన  తరవాత పరీక్షల తేదీలు వెల్లడిస్తామన్నారు. అభ్యర్థులకు తమ సమీపంలోని కేంద్రాల్లో పరీక్ష రాసే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తుల్లో మార్పు చేసుకునేందుకు జులై 2 వరకు ఇచ్చిన గడువును 9 వరకు పొడిగిస్తున్నామని అన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.