ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల (సిలబస్)ను ఇంటర్ విద్యా శాఖ 30 శాతం తగ్గించింది. కరోనా కారణంగా కళాశాలలను తెరవడంలో జాప్యం జరుగుతున్నందున పాఠ్యాంశాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే సీబీఎస్ఈ 30 శాతం తగ్గించినందున ఇందుకు అనుగుణంగా కొన్ని పాఠాలను తొలగించారు. సాధారణంగా 220 పనిదినాలు రావాల్సి ఉండగా.. సెప్టెంబరు 5 నుంచి కళాశాలలను ప్రారంభిస్తే 175 వరకు పనిదినాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలను ప్రారంభించారు. ఇటీవల లెక్చరర్లు ప్రవేశాల కోసం ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. పదో తరగతి పూర్తిచేసి ఇంటర్లో చేరేందుకు ఆసక్తి చూపిన వారికి బ్రిడ్జి కోర్సు పాఠాలు బోధించనున్నారు.
ఏపీ ఇంటర్మీడియట్ (2020 - 21) కొత్త సిలబస్ వివరాలు
Science Subjects Arts Subjects
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.